సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణం లోని గండూరి బ్రదర్స్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన 'జర్నలిస్టు జర్నీ' విలేకరి బచ్చు అనిల్ కుమార్ ను సహచర జర్నలిస్టులు మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తన టు వీలర్ పై మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం ముగించుకొని శంకర్ విలాస్ వైపు వస్తుండగా రోడ్డుకు అటు పక్కగా వస్తున్న రెండు బైకులు ప్రమాదవశాత్తు అనిల్ బైకును ఢి కోట్టడంతో బైక్ దెబ్బతినడంతో పాటు అనిల్ కాలికి దెబ్బ తగిలింది. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. జర్నలిస్ట్ అనిల్ ను పరామర్శించిన వారిలో సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ బంటు కృష్ణ, బచ్చు పురుషోత్తం, తండు వెంకన్న, కొండ్లే కృష్ణయ్య, ప్రభు కుమార్, దుర్గం బాలు, మల్లికార్జున్, జహీర్, రామచంద్ర రాజు, మామిడి శంకర్, మామిడి శ్రావణ్, పిచ్చయ్య, పడిసిరి వెంకట్ తదితరులున్నారు..
-----------------------
Admin