సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : మాండూస్ తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరో రెండు పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ సూచించారు. ఎటువంటి ఆపదలో ఉన్న కంట్రోల్ రూం నెంబర్లకు 08555292432, 9154968578కి సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. *ఈ మాండోస్ తుఫాను ప్రభావం అసలు రేపు కూడ తగ్గే లాగా లేదు. గతంలో చెప్పిన విధంగా ఈ మాండోస్ తుఫాను ప్రభావం డిసెంబరు 13 వరకు కొనసాగనుంది. ఈ రోజు తెల్లవారిజామున నుంచి రాయలసీమ లోపల అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, చిత్తూరు పశ్చిమ ప్రాంతాలు, కడప జిల్లాల్లో విస్తారంగా పడుతున్నాయి, అలాగే డిసెంబరు తుఫాను కాబట్టి చలి తీవ్రత కూడ తారా స్థాయిలో ఉంది. రేపు కూడ ఈ తుఫాను ప్రభావం ఉండనుంది. కొన్ని వాగులు అనంతపురం జిల్లాలో పొంగే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోగలరు....
-----------------------
Admin