సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఆమడగురు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రైతులకునోటీసులు ఇవ్వడం మరియు రైతుల ఖాతాలను హోల్డ్ లో పెట్టడం తగదని :గ్రేటర్ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి మున్నా, సత్యసాయి జిల్లా అమడుగురు మండలంలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ పెంచల్ రెడ్డి గత 2021 సంవత్సరంలో రైతుల పేర్లతో లోన్లు ఇస్తామని అమాయకులను చేసి రైతుల ఖాతాలలో దాదాపుగా 80 లక్షల రూపాయలను బ్యాంకు మేనేజర్ ఖాతాలో వేసుకొని స్వాహా చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న మేనేజర్ లోన్లు తీసుకోని రైతులకు డబ్బులు కట్టాలని నోటీసులు ఇచ్చారని అలాగే రైతులకు అమ్మ ఒడి కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాల డబ్బులను రైతు ఖాతాలను హోల్డ్ లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గ్రేటర్ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఈరోజు బ్యాంకు దగ్గర ధర్నా నిర్వహించి రైతుల ఖాతాలలోని డబ్బులను హోల్డ్ లో నుంచి తొలగించి వాళ్లకు RM గారు వచ్చి విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి జిల్లా కార్యదర్శి మున్నా, మహిళా సంఘం నాయకురాలు శివమ్మ రాజమ్మ రైతు సంఘం నాయకులు వెంకటేష్, ఆటో యూనియన్ నాయకులు మహబూబ్ బాషా, పాల్గొనడం జరిగింది...
-----------------------
Admin