సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పినపాక మండలం ఈ.బయ్యారం గ్రామం లో గుర్తు తెలియని దుండగులు రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి, కాపర్ వైరును చోరీ చేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కంది అచ్చిరెడ్డి పొలంలో, గట్ల బాలకోటిరెడ్డి పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకుని పంట సాగుచేస్తున్నారు, గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి కాపర్ వైరును చోరీ చేశారు, మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు, విద్యుత్ ఏఈ కావ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు, ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.
-----------------------
Admin