సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఫిబ్రవరి 13 సోమవారం జరగవలసిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ చక్రవర్తి ప్రకటనలో తెలిపారు . పోడుపట్టాలు జారి ప్రక్రియకు సంబంధించి జిల్లాస్థాయి అటవీ హక్కుల కమిటీ సమావేశం నిర్వహిస్తున్న కారణంగా సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ఆయన తెలిపారు. ప్రజలు ప్రజావాణి రద్దు విషయాన్ని గమనించి దరఖాస్తులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావద్దని అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. విషయాన్ని గమనించి రేపు ప్రజావాణికి కలెక్టరేట్ కు వెళ్ళొద్దని సూచించారు.
-----------------------
Admin