సర్కార్ టీవీ న్యూస్ / సిద్దిపేట జిల్లా : దుబ్బాక వ్యవసాయ మార్కెట్ కమిటీ మొదటి కార్యవర్గ సమావేశం శుక్రవారం ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా రహస్యంగా జరిగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రైతులకు సంబంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించకపోవడం విచారకరం. వ్యవసాయ మార్కెట్ కమిటీ అంటే రైతుల బాగోగులు కోసం ఏర్పాటు చేసే ఓ కమిటి... అట్టి కార్యవర్గ సమావేశంలో రైతుల విషయాన్ని ప్రస్తావించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసమే ఏర్పాటు చేసుకున్న ఓ కమిటీగా నూతన నియామకమైన కార్యవర్గ సభ్యులు అనుకుంటున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. మొదటి కార్యవర్గ సమావేశంలో రైతుల ప్రస్తావనే లేవనెత్తాక పోవడం దారుణమని అంటున్నారు. ఇట్టి కార్యవర్గ సమావేశం కనీసం జర్నలిస్టులకు కూడా సమాచారం ఇవ్వకుండా నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి కార్యవర్గ సమావేశం సమాచారం అందరికీ ఇవ్వాలని అంటున్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులుతన్నీరు హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టిలకు తీసుకెళ్తామన్నారు...
-----------------------
Admin