సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ (పేపర్ శ్రీనన్న) సూచన మేరకు బుధవారం షాద్ నగర్ నియోజవర్గ టీయూడబ్ల్యుజే(ఐజేయు) ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించారు..ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం హజరయ్యారు. ఈ సందర్బంగా ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. షాద్ నగర్ నియోకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులుగా నర్సిములు (ఎన్ టీవీ), సలహాదారుగా శ్రీనివాస్ (హెచ్ఎమ్ టివి), అద్యక్షులుగా రాఘవేందర్ యాదవ్ (రఘు) (99 టివి), ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ ( స్టూడియో 18), విష్ణు(6 టివి), ప్రధాన కార్యదర్శిగా ఖాజా సోహైల్ (V5 ), సహాయ కార్యదర్శి గా సవాళ్ల రాజు (న్యూస్ 9 టుడే), సంయుక్త కార్యదర్శులుగా ఈక్బాల్, శ్రీకాంత్, కార్యదర్శులుగా కార్తిక్, జగన్, బసవేశ్వర్, గోపాల్, ప్రచార కార్యదర్శులుగా సాయినాథ్, నరేష్ లను ఎన్నుకున్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం మాట్లాడుతూ.. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అందరు కలిసి కట్టుగా ఏకతాటిపై ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు తెచ్చుకునేలా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు యాదగిరి, శివ, రాజశేఖర్, ఇలియాస్, సమి, చందు తదితులున్నారు.
-----------------------
Admin