Thursday, 30 July 2026 03:26:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చందాలు - దందాలు లేకుండా పాలన సాగిస్తాం...

Date : 29 October 2023 09:40 AM Views : 322

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గంలో వ్యాపార వర్గాల వారిని చందాలు,దందాల పేరుతో సాగిస్తున్నా అరాచకాలను ఇకపై కొనసాగనివ్వమని బీఎస్పీ కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడ్వకేట్ యెర్రా కామేష్ వ్యాపారస్తులకు హామీ ఇచ్చారు.మన కొత్తగూడెం-మన కామేష్ కార్యక్రమంలో భాగంగా శనవారం ఆయన పెద్ద బజార్,చిన్న బజార్ ప్రాంతాలలో వ్యాపారస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కొత్తగూడెం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల చందాలు,దందాలు ఎక్కువయ్యాయని పలువురు వ్యాపారస్తులు తన దృష్టికి తీసుకు వచ్చినట్లు తెలిపారు.సభలు,సమావేశాల పేరుతో రాజకీయ పార్టీల నాయకులు ఇష్టారాజ్యాంగ దోచుకుంటున్నారని,చందాలు ఇవ్వని వారిపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఎస్పి పార్టీ గెలిస్తే ఇలాంటి వాటన్నింటికీ చరమగీతం పాడుతుందని స్పష్టం చేశారు.కోవిడ్ సమయంలో,ఆ తర్వాత వ్యాపారాలు చేసుకునేవారు ఎంత ఇబ్బందులు పడుతున్నారో తనకు తెలుసునని తెలిపారు.వ్యాపారుల జోలికి వచ్చి చందాలు అంటూ వసూళ్లకు పాల్పడితే తాట ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపారాలు చేసుకుంటూ మనుగడ సాగించడమే గగనం అవుతుందని,అలాంటి వారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.క్లీన్ కొత్తగూడెం నినాదంతో బీఎస్పీ పార్టీ ముందుకు సాగుతోందని,వ్యవస్థల్లో పేరుకుపోయిన అవినీతిని,వ్యక్తుల్లో పెరుగుతున్న అత్యాశలను సమూలంగా రూపుమాపి నూతన తరానికి కొత్తరకం అభివృద్ధిని పరిచయం చేస్తామని స్పష్టం చేశారు.ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరు తనకు అండగా ఉండాలని తెలిపారు.రానున్న ఎన్నికల్లో తనను గెలిపించి,కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,ఏడెల్లి మర్తమ్మ,వసుంధర,సందేలసందీప్,తాటిపాముల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :