Thursday, 30 July 2026 02:38:49 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం-పిల్లలకు తప్పకుండ పల్స్ పోలియో చుక్కలు వేయించాలి.

Date : 04 March 2024 09:00 AM Views : 430

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పిల్లల నిండు జీవితానికి రెండు పల్స్ పోలియో చుక్కలు తప్పక వేయించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా కోటాచలం అన్నారు. ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో సహచర వైద్యులతో కలసి చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2364 మందిని నియమించాని , 591 బూత్ ల ద్వారా పోలియో చుక్కలు వేయడం జరిగిందని మొదటి రోజు 90 శాతం పూర్తి చేశామని అన్నారు. జిల్లాలో ని ఏరియా ఆసుపత్రుల తో పాటు పి హెచ్ సి లు, సబ్ సెంటర్స్ , ఇతర ప్రాంతాలలో నియమించిన బృందాలు పోలియో చుక్కలు అందించారని తెలిపారు. జిల్లా లో 27 మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి మూడు రోజులు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 5 వరకు ఉంటుందని పిల్లల తల్లిదండ్రులు 0..5 వయస్సు ఉన్న పిల్లలకు తప్పక పోలియో చుక్కలు వేయించుకోవాలని విజ్ఞప్తి చేసారు. జిల్లాలో 0..5 సంవత్సరాల పిల్లలు 92965 మంది ఉన్నారని, పిల్లలకు అంగవైకల్యం రాకుండా పోలియో చుక్కలు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. జిల్లాలో 5 సంవత్సరాల పిల్లలకు మూడు రోజుల పాటు బస్టాండ్స్, ముఖ్య కూడళ్లు,అంగన్వాడీ కేంద్రాలు, నది పరివాహక ప్రాంతాలు, ఇంటింటి సర్వే ద్వారా పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా అందించాలని బృందాలను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు డా మురళీధర్ రెడ్డి, డి ఐ ఓ డా వెంకటరమణ, పిల్లల వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :