సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట సత్యం కన్వెన్షన్ లో జిల్లా అధ్యక్షులు గంటా రవి కుమార్ అధ్యక్షతన స్థానిక ఎన్నికల సన్నాక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల కన్వీనర్ మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ మరియు మాజీ పార్లమెంటు సభ్యులు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్, డాక్టర్ టి. రాజేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గార్లు పాల్గొన్నారు. గంట రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు. ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని విమర్శించారు. రైతులకు సన్న వడ్ల కు బోనస్, చేయుత పెన్షన్ 4 వేలకు పెంపు గాలికి వదిలేసిందని గంట రవికుమార్ ఆరోపించారు. ఆరూరి రమేష్ మాట్లాడుతూ బరిలో ఎవరు నిలిచినా కలిసికట్టుగా పని చేసి స్థానిక ఎన్నికల్లో పార్టీకి అధిక సంఖ్యలో సీట్లు సాధించాలని శ్రేణులను మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ కోరారు. ఈసారి ప్రతీ గ్రామంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని పేర్కొన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపుంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా *భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలకు ఎంపిటిసి మరియు జడ్పిటిసి అన్ని స్ధానాల్లో ఆశావాహుల పేర్లు తీసుకోవడం జరిగింది,అన్ని స్థానాల్లో ఎక్కువ శాతం యువకులకు అవకాశం కల్పించి వారిని ప్రజాప్రతినిధులను చేసి వారిని రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళి పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు…అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, గురుమూర్తి శివకుమార్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, కంభంపాటి పుల్లారావు,చైర్మన్ జక్కు రమేష్,
-----------------------
Reporter