సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నిమోజకవర్గం పరిధిలోని చటాన్ పల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో ఎన్నో ఏళ్ళుగా ఇబ్బందులు పడుతున్న ప్రజల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ చొరవతో తీరనున్న చటాన్ పల్లి, షాద్ నగర్ ప్రయాణీకుల ఇక్కట్లు. ఇక్కడి రెండు దశాబ్దాల కల చటాన్ పల్లి రైల్వే బ్రిడ్జి.. అంజన్నతోనే సాధ్యం అయ్యింది. త్వరలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ప్రారంభం కానున్నాయి. రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నియోజకవర్గ ప్రజల తరపున సీఎంకు గతంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే ఇక్కడ అండర్ పాస్ వద్దు అంటూ స్థానికులు అప్పట్లో ఆక్షేపణం పెట్టడంతో ఈ పనులు కొంత ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి. ఎట్టకేలకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ ప్రభుత్వ నిధులు 95 కోట్లతో శంకుస్థాపనకు శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి ముహూర్తం మంగళవారం నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఎమ్మెల్యే అంజయ్య ఆహ్వానంతో ఇక్కడికి రానున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు సంబంధించి రూ. 404 కోట్లతో పనులను మంజూరు చేసింది. ఇందులో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని చటన్ పల్లికి రైల్వే నిధులు 33.69 కోట్లు కేటాయించగా రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం 95 కోట్లు తన వాటా ప్రకటించింది. ఇంతకాలంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజలు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎట్టకేలకు ఈ పనులకు ఎమ్మేల్యే కృషితో శంకుస్థాపన జరగబోతుంది. దశలవారీగా పట్టణంలో అనేక సమస్యత్మక ప్రాంతాలను గుర్తించి అనేక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కృషి చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పట్టణంలో చాలా పెద్ద సమస్య తీరబోతుందని పలువురు కొనియాడుతున్నారు.
-----------------------
Admin