సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఇల్లందు : ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో న్యాయవాదులపై దాడులు పరిపాటిగా మారాయి.అనునిత్యం కక్షిదారుల కొరకు మరియు వివిధ వర్గాల ప్రజల కోసం పాటుపడే న్యాయవాదులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో న్యాయవాద రక్షణ చట్టాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఫెడరేషన్ పిలుపుమేరకు ఇల్లందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేసి నిరసన కార్యక్రమాలు చేపట్టినారు. మున్ముందు న్యాయవాదులపై దాడులకు పాల్పడితే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా తెలిపినారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి న్యాయవాద రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కీర్తి కార్తిక్, సీనియర్ న్యాయవాదులు ఎస్ .వెంకటేశ్వర్లు ఎన్ .మల్లికార్జునరావు, పి. బాలకృష్ణ ,ఎస్. వెంకట నరసయ్య, పి. వెంకట నరసయ్య మామిడి సత్య ప్రకాష్ ,పైల జయప్రకాష్ , పి అనిల్ కుమార్, సిహెచ్ నవీన్ కుమార్, పి. ధనుంజయ్ రావు పాల్గొన్నారు వీరికి పట్టణంలో వివిధ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపినారు.
-----------------------
Admin