సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి రూరల్ మండలం, మిద్దివారిపల్లి గ్రామానికి 100 లక్షలతో నూతనంగా నిర్మించిన తారు రోడ్డును కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎటువంటి రోడ్డు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు రోడ్లు వేసే కార్యక్రమం చేపట్టారన్నారు. కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా 104 మరియు 108 వాహనాలు కూడా గ్రామాల్లోకి వెళ్ళనటువంటి 120 గ్రామాలకు అధ్యాధునికమైన 100 సంవత్సరాలు మన్నిక కలిగిన రోడ్లను నిర్మించామన్నారు. గత 40 సంవత్సరాలు లేనటువంటి అభివృద్ధిని కేవలం మూడు సంవత్సరాల కాలంలో చేసి చూపించామన్నారు. ఎటువంటి వివక్షత లేకుండా అర్హతే ప్రమాణికంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎండి ఇస్మాయిల్, ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, మండల కన్వీనర్ ప్రకాష్, సర్పంచ్ మణికంఠ నాయక్, వైస్ సర్పంచ్ గంగిరెడ్డి, ఎంపీటీసీలు ఆదినారాయణ, పుల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము గంగాదేవి శంకర్, సర్పంచులు చలపతి నాయక్, నారాయణస్వామి నాయక్, రవి నాయక్, నాగభూషణ్ రెడ్డి, రమణారెడ్డి, ఎంపీపీ తాతం జగన్మోహన్, మండల కన్వీనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీలు మధుకర్ రెడ్డి, నరసింహులు నాయక్ మరియు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
-----------------------
Admin