సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / తెలంగాణ సింద్దాంత కర్త, తెలంగాణ జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ 12 వ వర్ధంతి సందర్భంగా షాద్ నగర్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఆయన విగ్రహానికి ఉద్యమ కారుల ఆధ్వర్యంలో పూలమాలకు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ తెలంగాణ రాష్ట్ర సహకార సొసైటీ లిమిటెడ్ చైర్మన్ రాజా వరప్రసాద్ మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ వెంకన్న, వైస్ చైర్మన్ నటరాజన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు షాద్ నగర్ ఉద్యమకారులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1952 నుంచి తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని తెలంగాణ సమాజంలో అవగాహన కల్పించడంతోపాటు మలిదశ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయ పక్షాలన్నింటినీ ఒప్పించడంలో కీలక భూమిక వహించిన ప్రొఫెసర్ జయశంకర్ ని తెలంగాణ సమాజం ఎన్నటికీ మరువ లేదని ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలానే అమరవీరుల స్తూపం నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించి స్తూపం నిర్మాణం చేపట్టాలని, ఉద్యమ కారులను గౌరవించాలని కోరారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, రాష్ట వ్యవసాయ సహకార యూనియన్ చైర్మెన్ రాజా వరప్రసాద్ రావు, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎం ఎస్ నటరాజన్, జెడ్పీటీసీ వెంకట్ రాంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్, ప్రముఖ సామాజిక వేత్త వంగూరి గంగిరెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, షాద్ నగర్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మన్నే నారాయణ, నక్కల వెంకటేష్ గౌడ్, రాజ్య లక్ష్మి, లక్ష్మన్ నాయక్, జాంగారి రవి, జూపల్లి శంకర్, పిల్లి శేఖర్, చెట్ల నర్సింహ, నందిగామ శ్రీను, శరత్ కృష్ణ, రాఘవేందర్, మహేష్ మాల, కంసాన్ పల్లి యాదయ్య గౌడ్, యాదయ్య, టు వీలర్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాకర్ గౌడ్, వినియోగదారుల ఫోరం నేత నక్క బాలరాజు యాదవ్, కార్మిక నేతలు కుమార్, భాస్కర్, రఘు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin