సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) అధ్వర్యంలో ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన తెలియ చేశారు.ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.శివకుమార్, గ్యార క్రాంతి మాట్లాడుతూ గురునానాక్ యూనివర్సిటీకి అనుమతి లేకుండా అడ్మిషన్లను స్వీకరించిన కాలేజీ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. 3800 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం తో పాటు ఫీజుల రూపంలో సుమారు 180 కోట్ల రూపాయలను వసూలు చేశారని అన్నారు. దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్ తమిళసై వెంటనే జోక్యం చేసుకొని విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలో పునరావృత్తం కాకుండా అన్ని యూనివర్సిటీలపై పర్యవేక్షణ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వలన గురునానక్ కాలేజ్ యాజమాన్యం ఈ దుశ్చర్యలకు పాల్పడిందని వారు అన్నారు.. విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు వారి ఆందోళనలకు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఎఐఎస్ఎఫ్ పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు. విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులపై లాటి చార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.నాయకుల పై ,తల్లిదండ్రులపై విద్యార్థుల పైన అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలి వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ నాయకులు సూర్యం, అఖిల్, గణేష్, విజేందర్, సిపిఐ నాయకులు రాజు,గాలయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin