సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లో గీత కార్మికులకు 55 కొత్త లైసెన్సులను మంజూరు చేయించిన సందర్భంగా పట్టణ గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేపట్టారు కే ఎల్ ఎన్ ప్రసాద్ , దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగని నాగన్న గౌడ్ మాట్లాడుతూ ఇంకా 80 కార్డులు ఎలక్షన్ కోడ్ అనంతరం మంజూరు చేయించి త్వరలోనే అందజేపిస్తామని తెలిపారు. అర్హులైన వారందరూ కూడా లైసెన్సులు పొందటానికి అప్లికేషన్ పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక సొసైటీ అధ్యక్షుడు వల్లపు దాసు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో శాలువాలతో పూల మాలతో కే ఎల్ ఎన్ ఘనంగా సన్మానించారు. కె ఎల్ ఆర్ ప్రసాద్ గౌడ సోదరుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారని తెలియజేశారు . గౌడ గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఎక్స్గ్రేషన్ తొందరగా ఇచ్చే విధంగా ప్రమాద సమయంలో మెడికల్ ఖర్చుల కొరకు తక్షణమే 15వేల రూపాయలను ఇచ్చి కుటుంబానికి ఉపయోగపడే లా ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తారని తెలియజేశారు.గౌడ సంఘం అభివృద్ధికి తోడ్పడ్డారని టి సి ఎస్ లైసెన్స్ అన్ని గ్రామాల్లో పూర్తి చేస్తున్నారని తెలియజేస్తూ పట్టణం లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గౌడ సోదరులందరూ ఐక్య మత్తంగా కృషి చేయాలని తెలియజేశారు. గౌడ సొసైటీ త్వరగా ఓటర్ లిస్టు తయారు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు గౌడ గీత కార్మికుల లైసెన్సులను పునరుద్ధరించి గౌడ గీత సొసైటీ ఎలక్షన్లకు సిద్ధం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద గౌడ్ బెల్లంకొండ చిన్న వెంకటేశ్వర్లు,చిరంజీవి)ఈ కార్య క్రమంలో పెద్ద గౌడ్ తండు ఉపేందర్ గౌడ్, సోమగాన్ని రామ్మూర్తి గౌడ్, బాల బోయిన సత్యనారాయణ గౌడ్, వల్లపు దాసు వెంకటేశ్వర్లు గౌడ్ ,గండు వల్లపు దాసు పాండు తదితర గీత కార్మికులు గౌడ సోదరులు పాల్గొన్నారు.
-----------------------
Admin