సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి, దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండలం దేశాయిపల్లి (శంబాయపల్లి గ్రామం లో దసరా వేడుకల్లో భాగంగాఅమ్మవారికి బొడ్రాయి భూలక్ష్మి మాత కి గుమ్మడికాయతో మరియు సొరకాయతో శాంతి చేయడం చేశారు . అనంతరం జమ్మికొమ్మ వద్ద గ్రామస్తులు పాటు పూజలో చేశారు తోగరు పవన్ కుమార్ ఈ సందర్భంగా సర్కార్ న్యూస్ వరంగల్ జిల్లా ఇన్చార్జి తొగరు పవన్ కుమార్ మాట్లాడుతూ దసరా పండుగ చెడుపై మేలుకి ప్రతీక అని, జమ్మి చెట్టు పవిత్రతతో కూడినది కాబట్టి శాస్త్రోక్తంగా పూజించడం మన సంప్రదాయంలో ఉన్న గొప్ప ఆచారం అని పేర్కొన్నారు. ఈ పూజ ద్వారా ప్రజల ఇళ్లలో శాంతి, ఐశ్వర్యం, సుఖసంతోషాలు నిండాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ, సమాజంలో మంచి విలువలను కాపాడుకోవాలని సూచించారు. సత్యం – ధర్మం – న్యాయం అనే మార్గంలో నడిచినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, దసరా పండుగ ఆ బాటలో మనకు స్ఫూర్తినిస్తుందని అన్నారు.. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు, మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
-----------------------
Reporter