సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : బిజెపి ఎన్నికల ప్రచారం లో భాగంగా ఆదివారం రోజు షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల అధ్యక్షులు చేగు సుధాకర్ ఆధ్వర్యం లో దేవుని మామిడిపల్లి, మజీద్ మామిడిపల్లి, శ్రీనివాసుల గుడా లో బిజెపి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి బిఆర్ఎస్ ను, కుటుంబ పాలన ను ఇంటికి పంపించే రోజులు దగ్గర లోనే ఉన్నాయన్నారు. తెలంగాణ లో వచ్చేది బిజెపి ప్రభుత్వమే అని అన్నారు. ఉచిత విద్యా, ఉచిత వైద్యం బిజెపితోనే సాధ్యం అని అన్నారు. అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో మీ ఇంటి పెద్దగా మీలో ఒకడిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చిన బిడ్డను కాబట్టి ఆశీర్వదించాలని కోరారు. కేవలం ఓట్ల కోసమే మీ దగ్గరకు వచ్చే నాయకులకు తగిన బుద్ది చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి, ఆకుల ప్రదీప్, మోహన్ సింగ్ గారు, కోడిచర్ల సర్పంచ్ వెంకట్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, పసుల నర్సింహా యాదవ్, నరేందర్ రెడ్డి, వెంకటేష్,, శ్రీనివాస్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, జగన్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, లింగం, నరేందర్, మల్లారెడ్డి, శ్రీధర్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణయ్య, అరవింద్, అనిల్, కిషన్ నాయక్, వివిధ గ్రామాల బిజెపి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు
-----------------------
Admin