సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : మండలంలోని ఏల్లాపురం, కొత్తతండ, గుండ్ల పహాడ్ గ్రామంలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి గడప గడపకు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపిపి భూక్యా గోపాల్ నాయక్, మండలపార్టీ అధ్యక్షుడు ఎన్. వి సుబ్బారావు, జెడ్పీటీసీ మాలోత్ మోతిలాల్ నాయక్, డిసిసి ప్రధాన కార్యదర్శి బైరెడ్డి జితేందర్ రెడ్డి, ఎంపిటిసి ల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ మహాలక్ష్మి:- మహిళలకు ప్రతీ నెల ₹2500,- కేవలం ₹500 కే వంట గ్యాస్ సిలిండర్.- ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం. రైతు భరోసా:- ప్రతీ ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి ₹15,000. - ₹12,000 వ్యవసాయ కూలీలకు.- వరి పంటకు 500 బోనస్. గృహ జ్యోతి: - ప్రతి కుటుంబానికి ప్రతీ నెల 200 యూనిట్ల ఉచిత విద్యుథ్ ఇందిరమ్మ ఇళ్లు:- ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు.-ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం. యువ వికాసం:- విద్యార్థులకు ₹5 లక్షల విద్యా భరోసా కార్డు. - ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. చేయూత:-వృద్ధులు,వితంతువులు, వికలాంగులు,బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు,కల్లుగీత కార్మికులు,నేత కార్మికులు,ఎయిడ్స్,ఫైలేరియా బాధితులకు నెలకు రూ.4,000 పింఛన్.- పేదలకు 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా. లాంటి ఇంకెన్నో పథకాలు అమలు చేస్తారని ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజక వర్గ మహిళా కో ఆర్డినేటర్,శకుంతలరెడ్డి,నాయకులు బెల్లంకొండ నరసింహ రావు, నీమానాయక్, వాజిడ్,తీగల శేశీరెడ్డి,పోతురాజు జ్యోతి, మహ్మద్ ఖాసీం,అందే రాజు, సుబ్బు గౌడ్, బుడిగె సైదులు,సందీప్ ,రాములు,వెంకట్ రెడ్డి,రమేష్,హమీద్, రాజ్ బుడే,హఫీజ్,శ్రీకాంత్,శేషు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin