సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజక వర్గం లోని మాక్లూర్ మండలం మందాపూర్, ధర్మారం గ్రామాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఇంటికి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని కోరారు, ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం చేపడతానని అన్నారు. హిందువుల అందరూ ఐక్యంగా ఉండి బిజెపికి ఓటు వేయాలని ఇతర పార్టీల అపోహాలు నమ్మవద్దని ఓటుతో వారికే సమాధానం చెప్పాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు సురేష్ నాయక్, గంగోని సంతోష్, ఎంపీటీసీ వడ్డెన్న తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin