సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ప్రజల సంక్షేమమే టిడిపి ధ్యేయమని మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఏపీ కి ముఖ్యమంత్రి అయితేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని 175 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయం అన్నారు. ఓడి చెరువు మండలంలోని మల్లురమ్మ దేవత ఆలయ నిర్మాణం 40 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకటాపురం, నల్లగుట్లపల్లి ,మామిళ్ల కుంట్లపల్లి పంచాయతీ లోని ఎం.కొత్తపల్లి లో ప్రత్యేక జాతర ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయా గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం అన్నారు. అమరావతి రాజధాని రైతులు పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేని వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తోందన్నారు. వైసీపీకి అంతిమకాలం దగ్గర పడిందన్నారు. ప్రభుత్వం లో ఉన్న మంత్రులు కూడా నిర్లక్ష్యంగా మాట్లాడడం సిగ్గుగా ఉందన్నారు. జగన్ రెడ్డి తుగ్లక్ పాలనకు ప్రజలు చమరగీతం పాడతారని అన్నారు. ఓబుల దేవర చెరువు లో మృతి చెందిన రజీయా కుటుంబాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు.ఆమె మృతితో ఆ కుటుంబం పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. ఆ కుటుంబానికి మాజీ మంత్రి పల్లె ఆర్థిక సాయం అందజేశారు.మాజీ మంత్రి తో పాటు మండల టీడీపీ కన్వీనర్ జయచంద్ర, మాజీ జెడ్పిటిసి పిట్ట ఓబుల్ రెడ్డి టిడిపి నాయకులు తుమ్మల మహబూబ్ బాషా, సర్పంచ్ శంకర్ రెడ్డి ,ఎంపిటిసి శ్రీనివాసులు , నిజాం, ,ఆరిఫ్ ఖాన్ అంజినప్ప, గంటా శ్రీనివాస్, షాను, కొత్త సుధాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin